ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని 58, 59, 60వ డివిజన్లకు సంబంధించిన వైఎస్సార్ ఆసరా చెక్కులను ఎమ్మెల్యే మల్లాది విష్ణు శనివారం ఎమ్మెల్సీ కరిమున్నీసా, డిప్యూటీ మేయర్ శైలాజా రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. రెండు విడతల వైఎస్సార్ ఆసరాకు సంబంధించిన రూ.60 కోట్లు మహిళల ఖాతాలో జమ చేశామని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. చంద్రబాబు గతంలో జన్మభూమి కమిటీల పేరుతో మహిళలను మోసం చేశాడని అన్నారు. టీడీపీ నేతలు ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకొని నీచ రాజకీయాల చేస్తున్నారని అన్నారు. అమ్మ ఒడి గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీ నేత అచ్చెన్నాయుడుకు లేదని అన్నారు.