Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

అన్నమయ్య జిల్లా అంగళ్లులో తీవ్ర ఉద్రిక్తత…

టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య దాడులు

అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధబేరిలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు రాయలసీమలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఏర్పాటు చేసిన బ్యానర్లను వైసీపీ కార్యకర్తలు చించివేయడంతో వివాదం రాజుకుంది. అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులకు దాడులకు దిగాయి. ఈ ఘర్షణలో మదనపల్లె మండలం కొత్తపల్లి ఎంపీటీసీ దేవేంద్ర, ఇతర టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు.జెండాలను గాల్లో తిప్పుతూ టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేందుకు వైసీపీ శ్రేణులు యత్నించినట్టు టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా టీడీపీ వర్గీయులపై వైసీపీ శ్రేణులు రాళ్లు, కర్రలతో దాడికి దిగింది. అంగళ్లు సెంటర్ వద్దకు ఇరువర్గాలు చేరడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఇంత జరుగుతున్నా పోలీసులు స్పందించకుండా, చోద్యం చూస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img