బెంగుళూరు: భారతదేశంలోని అమెజాన్ ప్రైమ్ సభ్యుల కోసం అమెజాన్.ఇన్ నిర్వహించిన రెండు రోజుల ప్రైమ్ డే 2022 సంబరం (జులై 23 మరియు 24న) విజయవంతంగా ముగిసింది. భారతదేశంలో 95% పిన్కోడ్స్ నుండి ప్రైమ్ సభ్యులు ఈ సంవత్సరం ప్రైమ్ డే నాడు కొనుగోళ్లు చేసారు. 32,000కి పైగా విక్రేతలు తమ అత్యధిక విక్రేతల రోజుని చూసారు. గత ఏడాది ప్రైమ్ డేతో పోల్చినప్పుడు ప్రైమ్ సభ్యత్వం కోసం 1.5లక్షల మంది కస్టమర్స్ సైన్ అప్ చేసారు, 3 కొత్త సభ్యులలో 2 ప్రముఖ 10 పట్టణాలు/నగరాలైన రూర్కెల, మోకోచుంగ్, కుల్లు, ధోల్ పూర్, నాగపట్టిణం, టోంక్, సెహోర్, కాంచీపురం, రాయ్బరేలీ, రామ్గర్, తంజావూరు, సవాయ్ మాధోపూర్, యమునా నగర్ వంటి ప్రాంతాలు నుండి ప్రైమ్లో చేరారు. ప్రైమ్ వీడియోలో భాతదేశంలో ప్రైమ్ డే ఎంటర్టైన్మెంట్ శ్రేణిని దేశంలో, వెలుపల వినియోగదారులు ఇష్టపడ్డారు. 3800కి పైగా భారతదేశపు పట్టణాలు, నగరాలు నుండి మరియు 230కి పైగా దేశాలు, భూ ప్రాంతాలలో ప్రైమ్ సభ్యులు ప్రైమ్ వీడియోపై భారతదేశంలో ప్రైమ్ డే విడుదలలు చూసినట్లు అమేజాన్ ఇండియా ప్రైమ్ అండ్ డెలివరీ ఎక్స్ పీరియెన్స్ డైరక్టర్ అక్షయ్ సాహి తెలిపారు.