Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఇండిగోలో ‘త్రీ-పాయింట్‌ డిసెంబార్కేషన్‌ సిస్టమ్‌’ పరిచయం

న్యూఢల్లీి: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో గురువారంనాడు ఒక కొత్త విప్లవాత్మక త్రీ పాయింట్‌ డిసెంబార్కేషన్‌ ప్రక్రియను ప్రవేశపెట్టింది. ఈ ప్రక్రియ తన కస్టమర్‌లు మునుపెన్నడూ లేనంత వేగంగా విమానం నుండి నిష్క్రమించడానికి వీలు కల్పిస్తుంది. కొత్త త్రీ పాయింట్‌ డిసెంబార్కేషన్‌ ప్రక్రియ రెండు ముందరి, ఒక వెనక ఎగ్జిట్‌ రాంప్‌ ద్వారా నిర్వహించబడుతుంది. ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ ప్రక్రియను ఉపయోగించిన ఎయిర్‌లైన్‌గా ఇండిగో నిలిచింది. ఈ ఉన్నతమైన త్రీ పాయింట్‌ డిసెంబార్కేషన్‌ ప్రక్రియ, ఇండిగో తన 16వ వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారుల అనుభవంలో కొత్త ప్రమాణాలను నిర్దేశించడంలో సహాయపడుతుందని ఇండిగో పూర్తి స్థాయి డైరెక్టర్‌ రోనోజోయ్‌ దత్తా తెలిపారు. కస్టమర్‌లకు ఎటువంటి ఇబ్బంది లేని అనుభవాన్ని కలిగిస్తూనే విమానాశ్రయ ఆపరేటర్లు, ఇతర సిబ్బంది సామర్థ్యాలకు సహకరిస్తామని ఇండిగో ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ రాందాస్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img