హైదరాబాద్ : శాంసంగ్ టాబ్లెట్ల విభాగంలో జూన్తో ముగిసిన త్రైమాసంలో ఏకంగా 220 శాతం ఇయర్ ఆన్ ఇయర్ వృద్ధిని సాధించింది. ఐడీసీ వరల్డ్ వైడ్ క్వార్టర్లీ పర్సనల్ కంప్యూటింగ్ డివైజెస్ ట్రాకర్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, శాంసంగ్ ఈ జూన్ త్రైమాసాన్ని 45 శాతం మార్కెట్ వాటాతో ముగించింది. తద్వారా టాబ్లెట్ల మార్కెట్లో వరుసగా రెండవ త్రైమాసంలో తమ నాయకత్వ స్థానాన్ని కంపెనీ నిలుపుకుంది. టాబ్లెట్లతోపాటు శాంసంగ్ తన వినూత్నమైన ఉత్పత్తులతో వినియోగదారుల తొలి ప్రాధాన్యతగా నిలిచింది.