హైదరాబాద్ ః భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న డీటీసీ బ్యూటీ, పర్సనల్ కేర్ బ్రాండ్ మైగ్లామ్ తమ మొట్టమొదటి జాతీయ టీవీసీని ‘మీరు ఏం కోరుకుంటున్నారో మై గ్లామ్కు చెప్పండి (టెల్ మైగ్లామ్ వాట్ యు వాంట్)’ నేపథ్యంతో విడుదల చేసింది. ఈ ప్రచారంలో, నూతనంగా నియమించబడిన బ్రాండ్ అంబాసిడర్, ఇన్వెస్టర్ శ్రద్ధాకపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎన్నో సంవత్సరాలుగా, మహిళలు తమ అందమైన కథలను, కోరికలను పంచుకునే వేదికను మైగ్లామ్ నిర్మించడంతో పాటుగా ఈ పరిజ్ఞానంతోనే తమ ఉత్పత్తులను మైగ్లామ్ సృష్టిస్తుంది. తమకు ఏమి కావాలో బ్రాండ్కు తెలిపే శక్తిని వినియోగదారులకు అందించడం ద్వారా బ్యూటీ డెమోక్రసీని సృష్టించాలనే లక్ష్యంతో మైగ్లామ్ కృషి చేస్తుంది.