విశాలాంధ్ర/హైదరాబాద్: సి.కృష్ణయ్య చెట్టి గ్రూప్ ఆఫ్ జువెలర్స్ హైదరాబాద్లో తమ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా మూడు రోజుల ప్రత్యేక ఆభరణాల ప్రదర్శనను బంజారాహిల్స్లోని తాజ్ కృష్ణలో ఏర్పాటు చేసింది. ఇది జులై 31 వరకు కొనసాగుతుంది. సాంప్రదాయ, సమకాలీన డిజైన్ల విలక్షణమైన కలెక్షన్తో ప్రజల కోసం ఈ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసింది. ప్రముఖ నటి సుమ కనకాల, సి.కృష్ణయ్య చెట్టి గ్రూప్ ఆఫ్ జ్యువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చైతన్య వి కోతా ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. 53 ఏళ్ల చరిత్ర కలిగిన సి.కృష్ణయ్య చెట్టి గ్రూప్ ఆఫ్ జ్యువెలర్స్తో అనుబంధం ఏర్పడడం విశేషమని సుమ కనకాల అన్నారు. ఇది అనేక తరాల మహిళలకు సేవలను అందించిందన్నారు.