విశాలాంధ్ర, హైదరాబాద్ : వస్త్ర రంగంలో ప్రముఖ సంస్థ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఖమ్మం నగరంలో తన 25వ షోరూంను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. వి.వి.స.ి గ్రూప్ సంస్థల అధినేత రాజేంద్రప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీనటి కృతి శెట్టి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా కృతి శెట్టి మాట్లాడుతూ.. అన్ని రకాల వయస్సుల వారి అభిరుచులకు అనుగుణమైన వస్త్ర ప్రపంచాన్ని నెలకొల్పడంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. పండుగలు పెళ్లిళ్ల సీజన్కు ఖమ్మం వాసులు సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అందుబాటులో ఉంచుతుండడంతో వినియోగదారుల ఆదరాభిమానాలను చూరగొంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ డైరెక్టర్లు సురేష్, అభినయ్, రాకేష్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలలోనే కాక బెంగళూరులోనూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నంబర్ వన్ స్థాయికి చేరుకుందన్నారు. త్వరలో దక్షిణ భారత దేశంలోని ప్రముఖ నగరాలకు విస్తరిస్తామని పేర్కొన్నారు. ప్రారంభోత్సవ ఆఫర్ కింద మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్, కిడ్స్ వేర్ కాస్ట్ టు కాస్ట్కి విక్రయిస్తామని తెలిపారు.