Friday, April 26, 2024
Friday, April 26, 2024

హైదరాబాద్‌లో ఆకాష్‌`బైజూస్‌ నూతన క్లాస్‌రూమ్‌ కేంద్రం

హైదరాబాద్‌: దేశంలో టెస్ట్‌ ప్రిపరేటరీ సేవలలో అగ్రగామి సంస్థ ఆకాష్‌ బైజూస్‌ నేడు తమ నూతన క్లాస్‌రూమ్‌ సెంటర్‌ను హైదరాబాద్‌లోని సుచిత్ర వద్ద ప్రారంభించింది. నగరంలో ఎనిమిదివ తరగతి నుంచి నీట్‌, జెఈఈ, ఐఐటీ, ఒలింపియాడ్‌ కోచింగ్‌, ఫౌండేషన్‌ కోర్సులకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు ఈ కేంద్రం ప్రారంభించారు. ఈ నూతనకేంద్రంతో దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో నెట్‌వర్క్‌ కేంద్రాల సంఖ్య 330కు చేరింది. భారీ 18,775 చదరపు అడుగుల విస్తీర్ణంలో సర్వే నెంబర్‌ 85, రెండత అంతస్తు, జైన్‌ఫ్రెండ్స్‌ స్క్వేర్‌, సుచిత్ర అకాడమీ పక్కన, సుచిత్ర ఎక్స్‌రోడ్స్‌, హైదరాబాద్‌ వద్ద ఉన్న ఈ నూతన కేంద్రంలో 21 తరగతి గదులు ఉంటాయి. ఇవి 1500 మంది విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించేందుకు తగిన సౌకార్యలను అందించగలవు. అంతేకాకుండా హైబ్రిడ్‌ తరగతులను నిర్వహించే సదుపాయాలూ ఇక్కడ ఉన్నాయి. హైదరాబాద్‌ నగరంలో ఆకాష్‌ బైజూస్‌కు ఇది తొమ్మిదవ కేంద్రం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img