హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇపడ్రు వార్తల్లో ఉన్నాడు. ఆ మధ్య తన అన్న కళ్యాణ్ రామ్ సినిమా ఫంక్షన్కి వచ్చి, కొరటాల శివతో తాను చెయ్యబోయే సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు విడుదల అవుతుంది అనే విషయం చూచాయగా చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ అదే వార్త సాంఘిక మాధ్యమాల్లో మరోసారి వైరల్ అవుతోంది. సినిమా ఈనెల 23వ తేదీన అధికారికంగా లాంచ్ అవుతుందని, మార్చి నెల నుంచి షూటింగ్ మొదలవుతుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. ఎన్టీఆర్ పక్కన కథానాయిక ఎవరు అనే విషయం. ఎందుకంటే సాంఘిక మాధ్యమాల్లో జాహ్నవి కపూర్ అని అంటున్నారు. మొదటి నుండీ కూడా ఆమె పేరే వినపడుతోంది. ఆమె కూడా ఎన్టీఆర్ని చాలా సందర్భాల్లో చాలా పొగిడిరది కూడాను. అందుకని ఆమెనే తీసుకోవచ్చు అని కూడా అన్నారు. అయితే ఇది పాన్ ఇండియా సినిమాగా చేయాలన్న ఉద్దేశంతో కూడా ఆమెని తీసుకోవచ్చు అని కూడా అన్నారు. ఇప్పుడు ఇంకో నటి మృణాల్ ఠాకూర్ పేరు కూడా వినపడుతోంది. ఈమె కూడా హిందీ సినిమాలు చాలా చేసి, మంచి పేరు సంపాదించుకుంది. దానికి తోడు ఆమధ్య విడుదల అయిన ‘సీతారామం’ సినిమాలో మృణాల్ చాలా చక్కగా నటించి అందరి మెప్పు పొందింది. అందుకనే ఆమెని కథానాయికగా తీసుకోవచ్చు అని ఇంకో వార్త కూడా వస్తోంది. లేక ఇద్దరు కథానాయికలు కూడా ఇందులో ఉండే అవకాశం వుంది అని కూడా అంటున్నారు. ఇంతకీ ఎవరు ఎన్టీఆర్ పక్కన నటిస్తారు అనే విషయం ఈ సినిమా అధికారికంగా లాంచ్ అయినపుడు ప్రకటించే అవకాశం వుంది.