హైదరాబాద్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్- దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో మరో చిత్రం రూపొందనున్నట్టు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరితో కలిసి ఓ చిత్రాన్ని నిర్మించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కొన్నేళ్ల క్రితమే సన్నాహాలు మొదలు పెట్టిందట. పెద్ద మొత్తంలో అడ్వాన్స్ ఇచ్చి ప్రభాస్ డేట్స్ను బ్లాక్ చేసిందట. త్వరలోనే ఈ రేర్ కాంబినేషన్ సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. రాజమౌళి
ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కిన ఛత్రపతి, బాహుబలి`1, బాహుబలి 2 చిత్రాలు బాక్సాఫీస్ని ఎంతగా షేక్ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తాజా చిత్రం కోసం ప్రభాస్ని జక్కన్న మరెన్ని సంవత్సరాలు హోల్డ్లో ఉంచుతాడోనని ప్రభాస్ అభిమానులు భయపడుతున్నారు. బాహుబలి కోసం ప్రభాస్ ఐదేళ్లపాటు ఏ సినిమాకి కమిట్ కాకుండా ఉన్నాడు. దీంతో ప్రభాస్ని వెండితెరపై చూడ్డానికి ఐదేళ్లు పట్టింది.