Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చే మరో ప్రస్థానం

హైదరాబాద్‌ : తనీష్‌ హీరోగా దర్శకుడు జాని రూపొందించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘మరో ప్రస్థానం’ ట్రైలర్‌ని చిత్ర యూనిట్‌ గురువారం విడుదల చేసింది. ‘ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు అసలైన మనుషులు. ఒకరు చనిపోయినవాడు. మరొకడు ఇంకా పుట్టనివాడు’ అని విలన్‌ చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్‌ విడుదల సంద ర్భంగా చిత్ర నిర్మాత ఉదయ్‌ కిరణ్‌ మాట్లాడుతూ …ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇచ్చేలా మరో ప్రస్థానం సినిమా ఉంటుంది. నటీనటుల పెర్ఫార్మెన్స్‌, టెక్నికల్‌ అంశాల్లో కొత్తదనం చూస్తారు. అతి తక్కువ టైమ్‌లో షూటింగ్‌ కంప్లీట్‌ చేశాం. లాక్‌డౌన్‌ వల్ల రిలీజ్‌ ఆలస్యం అయ్యింది. ఈ నెల 24న థియేటర్‌ల ద్వారా మరో ప్రస్థానం చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నాం’ అన్నారు. చిత్ర దర్శ కుడు జాని మాట్లాడుతూ.. ఇది ఒక డెత్‌ స్ట్రింగ్‌ ఆపరేషన్‌ ఆధారంగా సాగే సినిమా. స్ట్రింగ్‌ ఆపరేషన్‌ అంటే అక్కడ జరుగుతున్న దాన్ని ప్రపంచానికి చూపించడమే మెయిన్‌ టార్గెట్‌ అన్నారు. అందరూ ఈ సినిమాకి మనసు ప్రాణం పెట్టి కష్టపడి పని చేశారు అందుకే అవుట్‌ ఫుట్‌ బాగా వచ్చిందన్నారు. హీరో తనీష్‌కి మోకాలు ఆపరేషన్‌ అయినా ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాడని చెప్పారు. ‘ప్రతి యాక్టరు ప్రతి సినిమాకి ఒక మెట్టు ఎదగాలనే కోరుకుంటూ సినిమాలు చేస్తారు. నేనూ మరో ప్రస్థానం చిత్రాన్ని అలాగే చేశాను. నటుడిగా నన్ను మరో మెట్టు పైకి ఎక్కించే సినిమా అవుతుంది’ అన్నారు హీరో తనీష్‌. ఈ చిత్రానికి మాటలు – వసంత కిరణ్‌, యానాల శివ, పాటలు : ప్రణవం, సంగీతం : సునీల్‌ కశ్యప్‌, సినిమాటోగ్రఫీ : ఎంఎన్‌ బాల్‌రెడ్డి. ఈ చిత్రంలో ముస్కాన్‌ సేథీ కదానాయిక. వరుడు ఫేమ్‌ భానుశ్రీ మెహ్రా, కబీర్‌ దుహాన్‌ సింగ్‌, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img