హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ‘మైఖేల్’ ఒకటి. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా, ఇప్పటికే చిత్రబృందం రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొల్పాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3న విడుదల చేస్తున్నట్లు పోస్టర్ను విడుదల చేశారు. కాగా ఇండస్ట్రీలో ఫిబ్రవరి నెలను డ్రై మంత్ అంటుంటారు. మరీ ఈ డ్రై నెల సందీప్కు కమర్షియల్ హీరో స్టేటస్ను తెచ్చిపెడుతుందా? లేదా? అనేది చూడాలి. గ్యాంగ్స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలకపాత్ర పోషిస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు, నటుడు గౌతమ్ వాసుదేవ మీనన్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. సందీప్కు జోడీగా దివ్యాంశ కౌశిక్ నటించింది. వరలక్ష్మీ శరత్కుమార్, వరుణ్తేజ్, అనసూయ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ ఎల్ఎల్పి, కరణ్ సి ప్రొడక్షన్స్ బ్యానర్లపై పుస్కుర్ రామ్మోహన్ రావు, భరత్ చౌదరీలు సంయుక్తంగా నిర్మించారు.