హైదరాబాద్ : సీనియర్ నటుడు బెనర్జీని హీరోగా పెట్టి.. యండమూరి వీరేంద్రనాథ్ ఓ చిత్రాన్ని తెం కెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు బెనర్జీ ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు హీరోగా చేస్తున్న చిత్రానికి ‘అతడు, ఆమె-ప్రియుడు’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో బెనర్జీ ఖగోళ శాస్త్ర ప్రొఫెసర్గా కనిపించనున్నారు. బ్లాక్ హ్యూమర్ థ్రిల్లర్ సస్పెన్స్ సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమా గురించి బెనర్జీ మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు నటుడిగా పలు భిన్నమైన పాత్రల్లో నటించిన నేను ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవు తున్నందుకు ఆనందంగా ఉంది. భిన్నమైన కథతో యండమూరి వీరేంద్రనాథ్ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే విడుదల ఉం టుంది. నా పాత్ర హైలెట్గా ఉంటుంది..’అని తెలిపారు.