హైదరాబాద్ : బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా శుక్రవారం హైదరాబాద్లో కొత్త సినిమా ప్రారంభమైంది. ఎస్ ఒరిజినల్స్ పతాకంపై సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు. సుబ్బు చెరుకూరి దర్శకుడిగా ఓ కొత్త కాన్సెప్ట్తో ఈ చిత్రం రూపొందించనున్నారు.
ముహూర్తపు సన్నివేశానికి నూతన దర్శకుడు విశ్వ క్లాప్ ఇచ్చారు. మోనోఫోబియాతో బాధపడుతున్న ఓ అప్ కమింగ్ రైటర్ తన జీవితానికి ప్రమాదం ఎదురైనప్పుడు వాటిని ఎలా అధిగమించి బయటపడ్డాడు అనే కథాంశంతో సరికొత్త అనుభూతి కలిగించేలా ఈ చిత్రం ఉండబోతుందని దర్శకుడు తెలిపారు. శ్రీరామ్ మడ్డూరి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కె సంతోష్ ఎడిటర్గా, మోహన్ చారి ఛాయగ్రాహకుడిగా పని చేస్తున్నారు.