Friday, April 26, 2024
Friday, April 26, 2024

మలయాళ నటుడు రమేశ్‌ ఆత్మహత్య

తిరువనంతపురం : మలయాళ టీవీ సీరియల్‌ నటుడు రమేశ్‌ వలియసాలా శనివారం అనుమానస్పద రీతిలో మృతి చెందారు. తన ఇంట్లో ఉరి వేసుకుని కనిపించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 22 ఏళ్ల నుంచి సినిమాలు, సీరియల్స్‌లో నటిస్తూ రమేశ్‌ బిజీగా ఉన్నారు. రెండు రోజుల క్రితమే షూటింగ్‌ ముగించుకుని తిరువనంతపురంలోని తన ఇంటికి వచ్చారు. ఇప్పుడు ఆయన మరణం కేరళ చిత్రసీమను దిగ్భ్రాంతికి గురి చేసింది. అనేకమంది నటీనటులు ఆయన మృతిపై సంతాపం తెలియజేస్తున్నారు. కరోనా కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో రమేశ్‌ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అందుకే బలవన్మరణానికి పాల్పడ్డారన్న ప్రచారం సాగుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img