హైదరాబాద్: సుమంత్ ప్రభాస్, సార్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘మేమ్ ఫేమస్’. గ్రామణీ నేపథ్య కథతో సాగే ఈ చిత్రానికి సుమంత్ ప్రభాస్ స్వీయ దర్శకత్వం వహిస్తున్నాడు. మే 26న థియేటర్లలో విడుదల కానుంది. కాగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తీరిక లేకుండా ఉంది. తాజాగా ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేశ్ బాబు వీక్షించాడు. తదుపరి సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడిరచాడు. ‘మేమ్ ఫేమస్ చూశా. అద్బుతమైన సినిమా. సినిమాలో ప్రతీ యాక్టర్ పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్గా ఉంది. ప్రత్యేకించి రైటర్, డైరెక్టర్, హీరో సుమంత్ ప్రభాస్ టాలెంట్ సూపర్. సినిమా విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అన్ని క్రాఫ్టులు పర్ఫెక్ట్గా కుదిరాయి. కొత్త యాక్టర్ల టీం ఈ సినిమా చేసిందంటే నమ్మలేకపోతున్నా. శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి, యువ నటీనటులందరికి శుభాకాంక్షలు. ఇలాంటి టాలెంట్కు మద్దతు ఇచ్చిన మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది’ అని మహేశ్ ట్వీట్ చేశాడు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు మంచి స్పందన వస్తోంది. రైటర్ పద్మభూషణ్ చిత్రాన్ని నిర్మించిన ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్, లహరి ఫిలిమ్స్ బ్యానర్లు మేమ్ ఫేమస్ సినిమాను తెరకెక్కిస్తున్నాయి. స్నేహం, ప్రేమ, కుటుంబ అంశాల నేపథ్యంలో సాగే కథతో మేమ్ ఫేమస్ నిర్మితం కాగా ఈ సినిమా పంపిణీ హక్కులను గీతా ఆర్ట్స్ సొంతం చేసుకుంది.