Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఓటీటీలో సల్మాన్‌ సినిమా

ముంబై: సల్మాన్‌ఖాన్‌ కథానాయకుడిగా నటించిన ‘కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్‌’ సినిమా ఓటీటీలో ప్రదర్శితం కానుంది. ‘జీ5’లో శుక్ర వారం నుంచి ఈ సినిమా అందుబాటులోకి రానుంది. సల్మాన్‌ ఖాన్‌ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి, ఫర్హాద్‌ సమ్జీ దర్శకత్వం వహించాడు. ఏప్రిల్‌ 21వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేశారు. యాక్షన్‌, ఎమోషన్స్‌ తో కూడిన కథ కావడం వలన, ఫ్యామిలీ ఆడియన్స్‌ కూడా ఈ సినిమాపై ఆసక్తిని పెంచుకుంటూ వచ్చారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో సల్మాన్‌ సరసన నాయికగా పూజ హెగ్డే నటించింది. ఇక కీలకమైన పాత్రలలో వెంకటేశ్‌ – జగపతిబాబు నటించారు. తెలుగు నుంచి స్టార్స్‌ ఉండటంతో, తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై ఆసక్తిని పెంచుకుంటూ వెళ్లారు. అయితే విడుదల రోజునే ఈ సినిమాపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాము ఆశించినట్టుగా లేదంటూ పెదవి విరిచారు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికపైకి ఈ సినిమా స్ట్రీమింగ్‌ హక్కులను జీ 5వారు దక్కించుకున్నారు. మే 26 వతేదీన ఈ సినిమాను స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. రవి బస్రూర్‌ ఈ సినిమాకి బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ను అందించాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img