Friday, April 26, 2024
Friday, April 26, 2024

‘రంగమార్తాండ’ చూసి భావోద్వేగానికి గురయ్యా


హైదరాబాద్‌: ‘రంగమార్తాండ’పై మెగాస్టార్‌ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమిదని అన్నారు. భావోద్వేగాలతో నిండిన ఇలాంటి అపురూప చిత్రాలను అందరూ ఆదరించాలని కోరారు. ఈ మేరకు చిత్రబృందాన్ని మెచ్చుకుంటూ ఆయన శనివారం ఉదయం ట్వీట్స్‌ చేశారు. ‘రంగమార్తాండ’ చూశాను. ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక మంచి చిత్రం ఇది. ప్రతి ఆర్టిస్ట్‌కు తన జీవితాన్నే కళ్ల ముందు చూస్తున్న భావన కలుగుతుంది. ఈ చిత్రం ఓ ‘త్రివేణీ సంగమం’లా అనిపించింది. కృష్ణవంశీ లాంటి ఓ క్రియేటివ్‌ దర్శకుడు, ప్రకాశ్‌రాజ్‌ లాంటి జాతీయ ఉత్తమ నటుడు, హాస్యబ్రహ్మానందం.. వారి పనితనం, ముఖ్యంగా ఆ ఇద్దరు అద్భుతమైన నటుల నటన ఎంతో భావోద్వేగానికి గురి చేసింది. బ్రహ్మానందం ఇలాంటి ఉద్విగ్నభరితమైన పాత్ర చేయడం ఇదే తొలిసారి. సెకండాఫ్‌ మొత్తం అప్రయత్నంగానే కన్నీరు వచ్చేసింది. ఇలాంటి చిత్రాలను అందరూ చూసి ఆదరించాలి. రసవత్తరమైన చిత్రాన్ని తెరకెక్కించిన కృష్ణవంశీ, ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ.. చిత్ర యూనిట్‌ మొత్తానికి నా అభినందనలు’’ అని చిరంజీవి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img