హైదరాబాద్: ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ ఆర్సి15 చిత్రం షూటింగ్లో పాల్గొంటున్నాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయిక. ఎస్వీసీ బ్యానర్పై దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇటీవలే రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంత భాగం షూటింగ్ జరుపుకోగా… ప్రస్తుతం షూటింగ్కు విరామం ఇచ్చారు. ఇదే క్రమంలో చరణ్ తాజాగా మరోసారి అమెరికాకు వెళ్లాడు. ఆస్కార్ నామినేషన్స్ కోసం ఈ మధ్యే మూవీ టీమ్ కొంతకాలం అక్కడే ఉండి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్లో చోటు దక్కించుకుని రేసులో నిలిచింది. ఈ అవార్డుల వేడుక మార్చి 12న జరగనుండగా.. చరణ్ 20 రోజుల ముందే యూఎస్ వెళ్లడంపై అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. అయితే వాటన్నింటికీ సమాధానం దొరికేసింది. ఫిబ్రవరి 24న ది బెవర్లీ విల్షైర్, ఫోర్ సీజన్స్ హోటల్లో జరగనున్న 6వ వార్షిక హెచ్సీఎ ఫిల్మ్ అవార్డ్స్కు రాంచరణ్ హాజరు కానున్నాడు. 2023 ఆస్కార్ ఫిల్మ్ అవార్డ్స్కు సంబంధించి ప్రజంటర్స్లో ఒకరిగా చరణ్ అరుదైన గౌరవం పొందాడు. బ్రాండన్ పెరియా, డేవిడ్ దస్మాల్చియాన్, మాడెలిన్ క్లైన్, ట్రినిటీ జో-లి బ్లిస్, వైలెట్ మెక్గ్రా తదితరులు సైతం ఈ ప్రతిష్టాత్మక అవార్డుల కార్యక్రమంలో సమర్పకులుగా వ్యవహరించనున్నారు. అందుకే చరణ్ యూఎస్ వెళ్లగా.. సంబంధిత పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే, రాంచరణ్ అయ్యప్ప మాలలో ఉన్నందున కాళ్లకి చెప్పులు లేకుండానే అమెరికా బయలుదేరాడు. మరో విషయం ఏంటంటే.. బెస్ట్ యాక్షన్ మూవీ, బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ, బెస్ట్ డైరెక్టర్ సహా బెస్ట్ మూవీ తదితర విభాగాల్లో హెచ్సీఏ ఫిల్మ్ అవార్డ్స్ 2023 ఫైనల్ నామినేషన్స్లో ఆర్ఆర్ఆర్ చోటు సంపాదించింది. అలాగే ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ ఫైనల్ నామినేషన్లలో చేరిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మిగతా ఆర్ఆర్ఆర్ టీమ్ మార్చి 7న లాస్ వేగాస్కు వెళ్లనుంది. కాగా తారకరత్న హఠాన్మరణం చెందడంతో నందమూరి కుటుంబం విచారంలో ఉన్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ అక్కడికి వెళ్లే విషయంలో స్పష్టత లేదు. అయితే, ఈ ఈవెంట్లో ఆర్ఆర్ఆర్ టీమ్ లైవ్ పెర్ఫామెన్స్ ఇవ్వనుందని తెలుస్తోంది.