హైదరాబాద్: ఏ పాత్ర అయినా అలవోకగా పోషించే నటుడు జూనియర్ ఎన్టీఆర్. డైలాగ్స్ను చెప్పడంలోను, అభినయించడంలోను తారక్కు ఎవరు సాటిరారు. ఆయన చివరగా ‘ఆర్ఆర్ఆర్’లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. తారక్ నటనకు కూడా అభిమానుల మెప్పుతో పాటు విమర్శ కుల ప్రశంసలు దక్కాయి. ‘ఆర్ఆర్ఆర్’తో తారక్పై అంచనాలు అమాంతం పెరిగి పోయాయి. అందువల్ల తన నుంచి వచ్చే ప్రాజెక్టులన్ని పాన్ ఇండియా రేంజ్లో ఉండాలని ఆచితూచి అడుగులేస్తు న్నారు. అయితే, జూనియర్ ఎన్టీఆర్కు సంబంధించిన ఓ అప్డేట్ కోలీవుడ్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేంటంటే.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్తో ఎన్టీఆర్ సినిమా చేయనున్నారని తెలుస్తోంది. తారక్కు ఆయన మూడు కథలు వినిపించారని సమాచారం. ఎన్టీఆర్ ఒక్క స్క్రిఫ్ట్ను ఎంపిక చేసుకున్నారని రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందట. మొదటి పార్ట్లో ఎన్టీఆర్ నటిస్తే, రెండో పార్ట్లో ధనుష్ నటించనున్నారని వదంతులు షికార్లు కొడుతున్నాయి. సమాజం లోని అసమానతలనే వెండితెరపై చూపిస్తారని వెట్రిమారన్కు మంచి పేరుంది. ‘విసారణై’, ‘అసురన్’, ‘వడ చెన్నై’ చిత్రాలన్ని ఆ కోవకు చెందినవే. ఈ సినిమాలతో వెట్రిమారన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన ప్రస్తుతం సూర్యతో ‘వడి వాసల్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్టుపై దృష్టి సారించనున్నట్టు సమాచారం