హైదరాబాద్ : సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టార్ మూవీ ‘భీమ్లా నాయక్’. ఈ సినిమా చివరి షెడ్యూల్ శరవేగంగా జరుగుతోంది. రానా, సంయుక్త మీనన్పై తెరకెక్కిం చాల్సిన సన్నివేశాలను త్వరలో పూర్తి చేయనున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న ఈ మూవీని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టైటిల్ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగా, త్వరలో సెకండ్ సింగిల్ రిలీజ్ చేసేందుకు చిత్రబృందం రెడీ అవుతోంది. 2022, సం క్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ నేప థ్యంలో షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం థమన్. పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తున్నారు.