Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

12న ఓటీటీలోకి శాకుంతలం

హైదరాబాద్‌: సమంత ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘శాకుంతలం’ గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య గత నెల 14న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైంది. విజువల్‌ వండర్‌గా త్రీడీ ఫార్మెట్‌లో విడుదలైన ఈ చిత్రం అంచనాలను చేరుకోలేక పోయింది. తొలి ఆట నుంచి నెగటివ్‌ టాక్‌తో నిరుత్సాహపరచింది. త్వరలో ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సినిమా అన్ని భాషల హక్కులను అమెజాన్‌ ప్రైమ్‌ కొనుగోలు చేసింది. ఈ నెల 12 నుంచి ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. థియేటర్లలో ఆకట్టుకోలేకపోయిన శాకుంతలం ఓటీటీలో అయినా ప్రేక్షకాదరణ పొందుతుందేమో చూడాలి. కాళిదాసు రచించిన అభిజ్ఞాన ‘శాకుంతలం’ నాటకం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. టైటిల్‌ పాత్రలో సమంత, దేవ్‌ మోహన్‌ దుష్యంతుడిగా నటించారు. నీలిమా గుణ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత ‘దిల్‌’ రాజు సమర్పకుడిగా వ్యవహరించారు. ఇందులో దుర్వాస మహర్షిగా కలెక్షన్‌ కింగ్‌ డా. మోహన్‌ బాబు, ప్రియంవద పాత్రలో అనన్యా నాగళ్ళ నటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img