ముంబై: రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదిపురుష్’. ప్రభాస్ రాముడిగా, కృతీసనన్ సీతగా నటిస్తున్న ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకుడు. టి.సిరీస్ భూషణ్కుమార్ నిర్మాత. విజువల్ వండర్గా రూపొందుతున్న ఈ చిత్రం కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారో…. ట్రైలర్ గురించి అంతే ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నారు. మే 9న గ్లోబల్ స్థాయిలో ట్రైలర్ను ఆవిష్కరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రభాస్ ట్విట్టర్ వేదికగా కొత్త పోస్టర్ను విడుదల చేశారు. మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలలో ఈ ట్రైలర్ను రికార్డ్ స్థాయిలో లాంచ్ చేయబోతుండడంతో ఇది వరల్డ్ ఈవెంట్గా మారింది. భారతదేశంతోపాటు సింగపూర్, ఇండోనేషియా, థాయ్లాండ్, మలేషియా, హాంకాంగ్, ఫిలిఫ్పైన్స్, మయన్మార్, శ్రీలంక, జపాన్తో సహా యూఎస్ఏ, కెనడా, మిడిల్ ఈస్ట్, ఆృరేస్టలియా, న్యూజిలాండ్, ఆసియా, ఆఫ్రికా, యూకే అండ్ యూరప్, రష్యా, ఈజిప్ట్ దేశాల్లో ట్రైలర్ను విడుదల చేయనున్నారు. అంతే కాదు న్యూయార్క్లోని ట్రిబెకా ఫెస్టివల్లో అంతర్జాతీయ ప్రీమియర్కు సెలెక్ట్ కావడం కూడా ఓ విశేషమే! . జూన్ 13న ట్రిబెకా ఫెస్టివల్లో ప్రీమియర్ కానున్న ఈ చిత్రాన్ని జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.