Friday, May 10, 2024
Friday, May 10, 2024

బిషప్ జయరావ్ పొలిమేర ఆశీస్సులు అందుకున్న చింతమనేని ప్రభాకర్….

అమలోద్భవి దేవాలయంలో ఫాదర్ మైఖేల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు…

విశాలాంధ్ర -ఏలూరు: దెందులూరు నియోజకవర్గ టిడిపి జనసేన బిజెపి కూటమి ఉమ్మడి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ సోమవారం ఉదయం రోమన్ కతోలిక పీఠం ఏలూరు పీఠాధిపతి అయిన బిషప్ జయరావ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖ అగ్ర పీఠాధిపతిగా కూడా ఇటీవల బిషప్ జయారావ్ అదనపు బాధ్యతలు అందుకున్న సందర్భంగా వారికి చింతమనేని ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బిషప్ జయరావ్ ప్రత్యేక ప్రార్దన నిర్వహించి చింతమనేని ప్రభాకర్ కు ఆశీస్సులు అందచేశారు. అనంతరం అమలోధ్భవి కథిడ్రల్ చర్చిలో ఆలయ గురువు ఫాదర్ ఇంజమాల మైఖేల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి చింతమనేని ప్రభాకర్ ను ఆశీర్వదిస్తూ పరిశుద్ద జలంతో దీవించారు.
ఈ కార్యక్రమంలో సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ ఇమ్మానియెల్, ఫాదర్ రాజు, ఫాదర్ స్టీవెన్ థామస్ సహా పలువురు గురువులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img