రిక్టర్ స్కేల్పై 5.2 తీవ్రత నమోదు
బీజింగ్ : చైనాలో ఆదివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.2గా నమోదు అయినట్లు చైనా భూకంప నెట్వర్కుల కేంద్రం (సీఈఎన్సీ) వెల్లడిరచింది. వాయువ్య చైనాలోని అక్కీ కౌంటీలో ఉదయం 6:02 గంటలకు (బీజింగ్ కాలమానం ప్రకారం) భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 10 కి.మీ లోతులో ఉందని సీఈఎన్సీ పేర్కొన్నట్లు జిన్హువా వెల్లడిరచింది. శనివారం తెల్లవారుజామున 3:29 గంటలకు చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతంలో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లోని మెర్కాంగ్ సిటీ ఆఫ్ అబా టిబెటన్-కియాంగ్ అటానమస్ ప్రిఫెక్చర్లో శుక్రవారం ఉదయం 00:03 గంటలకు (బీజింగ్ కాలమానం ప్రకారం) 5.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు సీఈఎన్సీ తెలిపింది. ఇదిలావుంటే శనివారం 04:55 గంటలకు దక్షిణ ఇరాన్లో 6.2 తీవ్రతతో, శనివారం తెల్లవారుజామున 6.1 తీవ్రతతో భూకంపం సంభవించగా ఐదుగురు మరణించారు. 12 మంది ఆసుపత్రి పాలయ్యారని ఇరాన్ గల్ఫ్ తీరంలోని హోర్మోజ్గాన్ ప్రావిన్స్లో అత్యవసర నిర్వహణ అధిపతి మెహర్దాద్ హసన్జాదే వెల్లడిరచారు.