అధ్యక్షుడి నివాసంలోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు
శ్రీలంకలో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. మరోవైపు రాజకీయ అస్థిరతా కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో భారీసంఖ్యలో ఆందోళనకారులు ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధికారిక నివాసాన్ని చుట్టుముట్టారు. దీంతో భద్రతా బలగాల బారికేడ్లను దాటుకుని మరీ లోపలికి ప్రవేశించారు. దీంతో వారి నుంచి తప్పించుకునేందుకు రాజపక్స తన ఇంటి నుంచి పరారయ్యారు. ఈ మేరకు దేశ రక్షణ వర్గాలు మీడియాకు వెల్లడిరచాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు న్యూస్ చానళ్లలో ప్రసారమయ్యాయి. మరికొద్దిసేపటికే అధ్యక్షుడు పారిపోయినట్టు వార్తలు వచ్చాయి. ఓ అంబులెన్స్లో ఎక్కి గోటబాయ రాజపక్స పారిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఇదిలా ఉండగా కొలంబోలో నిరసనలు ప్రారంభమవ్వడానికి ముందే రాజపక్స అధ్యక్ష భవనాన్ని వీడినట్లు తెలుస్తోంది. పరిస్థితులు అదుపుతప్పే అవకాశం ఉందని నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు ఆయన్ను ఆర్మీకేంద్ర కార్యాలయానికి తరలించినట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాగా తాజా ఘర్షణల్లో 30 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరు పోలీసు అధికారులు కూడా ఉన్నారు.