3,007కి చేరిన ఒమిక్రాన్ కేసులు
దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా లక్ష దాటిపోయాయి. కరోనా కేసులు పది రోజుల వ్యవధిలో 13 రెట్లు పెరిగి ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక దేశంలో ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. దేశ వ్యాప్తంగా ఒమైక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 3,007కి చేరింది. ఒమైక్రాన్ వేరియంట్ బారిన పడి కోలుకుని డిశ్చార్జ్ అయిన సంఖ్య 1,199గా ఉంది. మరోవైపు ఒమైక్రాన్ వేరియంట్ కేసులు రాష్ట్రాల వారిగా ఈ విధంగా ఉన్నాయి. మహారాష్ట్రలో 876, ఢల్లీిలో 465, కర్ణాటకలో 333, రాజస్థాన్లో 291, కేరళలో 284, గుజరాత్లో 204, తమిళనాడులో 121, హర్యానాలో 114, తెలంగాణలో 107, ఒడిస్సాలో 60, ఉత్తరప్రదేశ్లో 31, ఆంధ్రప్రదేశ్లో 28, వెస్ట్ బెంగాల్లో 27, గోవాలో 19, అస్సాంలో తొమ్మిది, మధ్యప్రదేశ్లో 9, ఉత్తరాఖండ్లో 8 కేసులు నమోదు అయ్యాయి. ఇక కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే కరోనా కేసుల సంఖ్య లక్ష దాటేసింది. గడచిన 24 గంటల్లో భారత్లో కొత్తగా 1,17,100 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 302 మంది మృతి చెందారు. 30,836 మంది డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 3,71,363కు చేరింది. కోవిడ్ డైలీ పాజిటివిటీ రేటు 7.74 శాతంగా నమోదైంది. ఇప్పటి వరకూ 3,43,71,845 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కోవిడ్తో మృతి చెందిన వారి సంఖ్య 4,83,178కి చేరింది.