కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవియా ట్వీట్
కొవిడ్ నియంత్రణకు చేపడుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ కొత్త మైలురాళ్లను సాధిస్తున్నదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవియా సోమవారం ట్వీట్టర్ లో పేర్కొన్నారు. కొవిడ్-19 వ్యాక్సిన్ మొదటి డోసు దేశంలోని వయోజనుల్లో 70 శాతం మందికి అందిందని ట్వీట్ చేశారు. గడిచిన 24 గంటల్లో 23,46,176 టీకా డోసుల నిర్వహణతో, సోమవారం ఉదయం 7 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం, కొవిడ్-19 వ్యాక్సిన్ డోస్లు 90.79 కోట్లకు మించాయని, దేశవ్యాప్తంగా జరిగిన 88,05,668 సెషన్ల ద్వారా ఇది సాధించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశ జనాభాలో 25 శాతం మందికి రెండు కొవిడ్ డోసులు అందాయి.5.67 కోట్లకుపైగా టీకా మోతాదులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి.