గుజరాత్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టేందుకు తమకు సమయం కావాలని చెప్పడం ఓ సాకుగా ఉందని గుజరాత్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మండిపడిరది. కొవిడ్ ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకోవాలన్న తమ ఉత్తర్వులను మార్చుతూ ఓ నోటిఫికేషన్ జారీ చేయడంపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. రోగులు, హాస్పిటల్ సిబ్బంది చనిపోయేంతవరకు మీరు చర్యలు తీసుకోరా అని ప్రశ్నించింది. 2022 వరకు మీరు మా ఉత్తర్వులను అతిక్రమిస్తూనే ఉంటారా అని న్యాయమూర్తులు జస్టిస్ వై.వి. చంద్రచూడ్, జస్టిస్ షా ప్రశ్నించారు.