Friday, April 26, 2024
Friday, April 26, 2024

కృష్ణా జలాలపై సుప్రీంకు ఏపీ


తెలంగాణతో ఉన్న కృష్ణా జలాల వివాదంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీకి దక్కాల్సిన న్యాయమైన వాటాకు తెలంగాణ గండి కొడుతోందని పిటిషన్‌ దాఖలు చేసింది.ఈ సందర్భంగా కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు పరిధిని నోటిఫై చేయాలని సర్వోన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. ‘ శ్రీశైలంలో తక్కువ నీరున్నా..తెలంగాణ విద్యుదుత్పత్తి చేసింది. దీంతో ఏపీ ప్రజలకు నష్టం వాటిల్లుతోంది. తాగు, సాగు నీటి జలాలు దక్కకుండా ప్రజల హక్కును హరిస్తోంది. తెలంగాణ చర్యలు రాజ్యాంగ విరుద్దం..ఆ రాష్ట్ర వైఖరి మా ప్రజల హక్కును హరించేలా ఉంది. విభజన చట్టాన్ని కూడా తెలంగాణ ఉల్లంఘిస్తోంది.’అని పిటిషన్‌లో పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img