కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ముల్లైపెరియారు డ్యామ్ కేంద్రంగా జలవివాదం నెలకొన్న విషయం తెలిసిందే.. నీటి మట్టం ఎత్తుప్తై కేరళ ప్రజలు ఆందోళన వ్యక్తం చేసూ నిరసన తెలుపుతుండగా.. తమిళనాడులోని అన్నదాతలు కూడా నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కి తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. డ్యామ్ నీటి విడుదల విషయంలో ఇరు రాష్ట్ర ప్రజలకు ఎటువంటి విభేదాలు వద్దని స్టాలిన్ పేర్కొన్నారు. కేరళలో భారీ వర్షాలకు నష్టపోయిన సరిహద్దు జిల్లాలో సహాయక చర్యలకు తమిళనాడు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని లేఖలో పేర్కొన్నారు.