Friday, April 26, 2024
Friday, April 26, 2024

కోవిడ్‌పై కేంద్ర మంత్రి మన్సూక్‌ మాండవీయ సమీక్ష..

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్‌ మాండవీయ ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. దేశంలో ఉన్న కోవిడ్‌19 పరిస్థితులపై ఆయన సమీక్షించారు. ఢల్లీిలో ఆయన అధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం చైనాలో మళ్లీ కోవిడ్‌ వేవ్‌ వస్తున్నట్లు వార్తలు వెలుబడుతున్నాయి. లక్షల సంఖ్యలో మళ్లీ జనం ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉన్నట్లు కూడా వార్నింగ్‌లు వచ్చాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఉన్న కోవిడ్‌ పరిస్థితులపై కేంద్ర మంత్రి మాండవీయ సమీక్షించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img