ముగ్గురి మృతి ` ఒకరు అరెస్టు
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
కోపెన్హాగెన్ : డెన్మార్క్ రాజధాని కోపెన్హాగెన్ ఉలిక్కిపడిరది. అక్కడి షాపింగ్ మాల్లో ఓ సాయుధుడు విచక్షణారహితంగా కాల్పులు జరుపగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గాయాలయ్యాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. సిటీ సెంటర్, విమానాశ్రయం మధ్య ఉన్న అమేగర్ జిల్లాలోని పెద్ద ఫీల్డ్ మాల్ చుట్టూ పోలీసు బలగాలను మోహరించినట్లు కోపెన్హాగన్ పోలీసులు ట్వీట్ చేశారు. కాల్పుల సమయంలో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. జనం భయంతో బయటకు పరుగులు తీశారు. అత్యాధునిక ఆయుధంతో ఇష్టారీత్యా కాల్పులు జరిపిన 22 ఏళ్ల నోవా ఎస్బెన్సన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, పదుల సంఖ్యలో జనం గాయపడ్డారని పోలీసులు చెప్పారు. మృతుల సంఖ్య పెరగవచ్చునన్నారు. కాల్పుల సమయంలో ప్రజలు పారిపోతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఉగ్రకోణాన్ని దర్యాప్తు చేయగా అదేమీ లేదని తేలినట్లు అధికారులు వెల్లడిరచారు. కాల్పులకు ఎందుకు తెగబడ్డాడన్న విషయం తేలలేదని, నిందితుడిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇదిలావుంటే, కాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలోని రాయల్ ఎరీనాలో ఓ వేడుకతో పాటు డెన్మార్క్ రాజు ఫ్రెడ్రిక్ ఫ్రాన్స్ సైక్లింగ్ బృందంతో జరగాల్సిన విందు కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు అధికారులు వెల్లడిరచారు. ఇది చాలా తీవ్రమైన ఘటన అని కోపెన్హాగెన్ మేయర్ సోఫీ హెచ్.అండర్సన్ అన్నారు. కోపెన్హాగెన్ కాల్పుల ఘటనను దేశ ప్రధాని మెటే ఫ్రెడరిక్సన్ తీవ్రంగా ఖండిరచారు.