దేశ రాజధాని నగరమైన దిల్లీలో పాకిస్థాన్ ఉగ్రవాదిని మంగళవారం ఢల్లీి పోలీస్ స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది. భారత జాతీయుడిగా నకిలీ గుర్తింపు కార్డుతో చెలామణి అవుతున్న మహ్మద్ అష్రఫ్ అనే ఉగ్రవాది లక్ష్మీనగర్లోని రమేష్ పార్క్ ప్రాంతంలో అరెస్టు చేసింది. అతని దగ్గరి నుంచి పోలీసులు ఏకే-47తోపాటు అదనంగా ఉన్న మ్యాగజైన్, 60 రౌండ్ల బుల్లెట్లు, ఒక హ్యాండ్ గ్రెనేడ్, 2 పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఉగ్రవాదిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల (నిరోధక) చట్టం, పేలుడు పదార్థాల చట్టం, ఆయుధాల చట్టంతోపాటు ఇతర సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడిరచారు. అతన్ని పాకిస్థాన్లో పంజాబ్ ప్రావిన్సులోని నరోవాల్ నివాసిగా గుర్తించారు.