Friday, May 17, 2024
Friday, May 17, 2024

దేశంలో కొత్తగా 5,379 కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. 24 గంటల వ్యవధిలో 3.21 లక్షల మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..5,379 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,44,72,241కి చేరాయి. ఇందులో 4,38,93,590 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. ఇప్పటివరకు 5,28,057 మంది మరణించగా, 50,594 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 7094 మంది కోలుకోగా, 16 మంది మరణించారు. కరోనా కేసులు తగ్గుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 1.67 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. మొత్తం కేసుల్లో 0.11 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.70 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని ప్రకటించింది. దేశవ్యాప్తంగా 213.91 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img