Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

దేశంలో కొత్తగా 6,984 కరోనా కేసులు


దేశంలో రోజువారీ కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తూనే ఉన్నాయి. దేశంలో కొత్తగా 6,984 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి మరో 247 మంది ప్రాణాలు విడిచారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,75,888కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 8,168 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 87,562 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడిరచారు. ఇక దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా సాగుతోంది. మంగళవారం 68,89,025 మందికి వ్యాక్సిన్‌ అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 1,34,61,14,483కు చేరింది. కాగా రోజు రోజుకూ మరింత వేగంగా వ్యాపిస్తోన్న కరోనా కొత్త వేరియంట్‌ కలవరపెడుతోంది. ఒమిక్రాన్‌ సైతం గాలి ద్వారా సోకుతుందని, చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. రెండు రోజుల్లోనే డబుల్‌ అయ్యే సామర్థ్యం ఉందని చెబుతున్నారు. తొలిసారిగా తెలంగాణలో రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img