Friday, April 26, 2024
Friday, April 26, 2024

దేశంలో కొత్తగా 7,946 మందికి కరోనా

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. స్వల్ప హెచ్చు తగ్గులతో కరోనా కేసులు పదివేల లోపే నమోదవుతున్నాయి. బుధవారం 7,231 పాజిటివ్‌ కేసులు నమోదవగా, నేడు కొత్తగా 7,946 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,44,33,762కు చేరింది. ఇప్పటివరకు 4,38,45,680 మంది కోలుకోగా, 5,27,911 మంది బాధితులు కరోనాకు బలయ్యారు. మరో 62,748 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 9828 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారని, మరో 37 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. కాగా, రోజువారీ పాజిటివిటీ రేటు 2.98 శాతంగా ఉందని తెలిపింది. మొత్తం కేసుల్లో 0.14 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.67 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. ఇక దేశవ్యాప్తంగా 212.52 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img