Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. . కొన్నిరోజులు 10 వేల పైచిలుకు కేసులు నమోదవుతుండగా, తాజాగా అవి 11 వేలు దాటాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 11,466 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతక్రితం రోజు కంటే కేసుల్లో 13 శాతం మేర పెరుగుదల కనిపించింది. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,43,88,579కి చేరాయి. ఇందులో 1,39,683 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,37,87,047 మంది బాధితులు కోలుకున్నారు. కరోనా బారినపడి మరో 4,61,849 మంది బలయ్యారు. కాగా, మంగళవారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 11,961 మంది కరోనా నుంచి కోలుకోగా, 24 గంటల్లో 460 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. కొత్త కేసుల్లో కేరళలోనే 6,409 కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో మరో 47 మంది మరణించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img