నోయిడా: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ తికైత్ స్పందించారు. ప్రజల నిర్ణయం ప్రధానమని, ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్లలో కొత్త ప్రభుత్వాలు… రైతులు,కార్మికుల కోసం పనిచేస్తాయని ఆశిస్తున్నామని తెలిపారు. ‘ప్రజాస్వామ్య గొప్ప పండుగలో ప్రజల నిర్ణయమే ప్రధానం. రైతుల ఉద్యమం ప్రభావాన్ని చూపింది. ఏర్పాటైన అన్ని ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లో రైతులు, రైతు కూలీల అభ్యున్నతికి కృషి చేస్తాయని ఆశిస్తున్నాం. విజయం సాధించిన అందరికీ అభినందనలు’ అని తికైత్ హిందీలో ట్వీట్ చేశారు.