టేకాఫ్ తర్వాత దిల్లీ-నాసిక్ విమానంలో ఆటోపైలట్ లోపం
దేశీయ విమానయాన సంస్థ స్పైస్జెట్ను వరుస వైఫల్యాలు వేధిస్తున్నాయి. తాజాగా మరో విమానంలో సాంకేతిక లోపం బయటపడిరది. గురువారం ఉదయం దిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నాసిక్కు బయలుదేరిన స్పైస్జెట్ విమానం ‘ఆటోపైలట్’ లోపంతో మధ్యలోనే తిరిగి వచ్చిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు వెల్లడిరచారు. బోయింగ్ 737 విమానం సురక్షితంగానే వెనక్కు వచ్చిందని పేర్కొన్నారు. అధిక ఇంధన ధరలు, రూపాయి విలువ క్షీణతతో స్పైస్జెట్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సంస్థ విమానాల్లో గతంలోనూ పలు సంఘటనల చోటుచేసుకోవడంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తరుచూ భద్రతా ప్రమాణాలను ఉల్లంఘిస్తోన్న స్పెస్జెట్కు ఎనిమిది వారాల పాటు 50 శాతం సర్వీసులనే నడపాలని జులై 27న డీజీసీఏ ఆదేశాలిచ్చింది.స్పైస్జెట్ విమానాల్లో సమస్యలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఇటీవల నాలుగు వారాల వ్యవధిలోపే 9 ప్రమాదకర సాంకేతిక సమస్యలు స్పైస్జెట్ విమానాల్లో తలెత్తాయి.ఒకసారి, విమానం గాల్లో ఉండగా క్యాబిన్ నుంచి పొగలు వచ్చాయి. మరో సందర్భంలో విండ్ షీల్డ్లో పగుళ్లను గుర్తించారు. మరోసారి, ఫ్యుయల్ ఇండికేటర్లో సాంకేతిక సమస్య బయటపడిరది. ముందే పరిష్కరించదగ్గ సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించి ప్రయాణీకుల ప్రాణాలతో ఆడుకోవడం సరికాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్గత భద్రతా పర్యవేక్షణ లోపం, నిర్వహణ చర్యలు చేపట్టకవడం వల్లే ఈ సమస్యలు తలెత్తినట్టు డీజీసీఏ దర్యాప్తులో తేలింది.