Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ప్రైవేటీకరణపై పునరాలోచన లేదు

విశాఖ స్టీల్‌పై కేంద్రం మరోసారి స్పష్టీకరణ

అమరావతి : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో కేంద్ర వైఖరిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినా, పార్టీలకతీతంగా ప్రజలు, కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తున్నా, జాతీయ స్థాయిలో పోరుకు రంగం సిద్ధమవుతున్నా కేంద్రం ఈ ప్రజా వ్యతిరేకతను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంలో పునరాలోచన లేదని కేంద్రం సోమవారం పార్లమెంటు సాక్షిగా మరోసారి పేర్కొంది. లోక్‌సభలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి భగవత్‌ కిషన్‌రావు కరాడ్‌ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీక రణను వెనక్కి తీసుకోవాలని గత కొన్ని నెలలుగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులతోపాటు వివిధ రాజకీయ పార్టీల నేతృత్వంలో గతంలో పాదయాత్రలు, బైక్‌ ర్యాలీలు చేపట్టారు. పరిశ్రమ పరిరక్షణే లక్ష్యంగా ఆగస్టు 1, 2 తేదీల్లో ‘చలో పార్లమెంట్‌’ చేపడుతున్నట్లు ఇటీవల పాదయాత్ర నిర్వహించిన కార్మిక సంఘాలు వెల్లడిరచాయి. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించు కునే వరకూ ఆందోళనలు కొనసాగిస్తామని ప్రకటించాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు కూర్మన్నపాలెంలో చేపట్టిన నిరవధిక దీక్షలు 165వ రోజుకు చేరాయి.మరో పక్క విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావ డానికి పార్లమెంట్‌ వేదికగా వైసీపీ, టీడీపీ ఎంపీలు ప్రయత్నం చేస్తున్నా కేంద్రం మాత్రం వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెబుతోంది. గతంలో రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌ అడిగిన ప్రశ్నకు ఇదే సమాధానం ఇచ్చిన కేంద్రం, తాజాగా వైసీపీ ఎంపీ మాధవ్‌ అడిగిన ప్రశ్నకూ అదే సమాధానమివ్వడం కేంద్ర మొండివైఖరికి నిదర్శనంగా పేర్కొనవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img