బాలీవుడ్ స్టార్హీరో షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ శుక్రవారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ముందు హాజరయ్యాడు. ప్రతి శుక్రవారం ఎన్సీబీ ముందు హాజరుకావాలనే బెయిల్ షరతులకు లోబడి ఈ రోజు ఎన్సీబీ కార్యాలయానికి వచ్చాడు. గంటసేపు అక్కడే ఉన్నారు. అక్టోబర్ నెల ప్రారంభంలో ముంబైలో క్రూజ్ నౌక డ్రగ్ కేసులో ముంబై హైకోర్టు ఆయనకు గత అక్టోబర్ 28న బెయిలు మంజూరు చేసింది. ఆర్యన్తో పాటు సహ నిందితుడు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలకు జస్టిస్ ఎన్డబ్ల్యూ సాంబ్రే బెయిల్ మంజూరు చేశారు. అయితే 14 షరతులు విధించారు. వీటిలో ప్రతి శుక్రవారం ఎన్సీబీ కార్యాలయంలో ఉదయం 11 గంటలు`మధ్యాహ్నం 2 గంటల మధ్య హాజరుకావడం ఒకటి. దానిలో భాగంగా ఆర్యన్ ఈరోజు ఎన్సీబీ కార్యాలయానికి వచ్చాడు. అలాగే, ఎప్పడు పిలిచినా ఎన్సీబీ కార్యాలయానికి హాజరుకావాలనే నిబంధన కూడా విధించారు. ఎన్సీబీ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, ఎన్డీపీఎస్ కోర్టు ముందు పాస్పోర్టులు సరెండర్ చేయాలని కూడా కోర్టు షరుతులు విధించింది. బెయిలుపై విడుదలైన అనంతరం ఎన్సీబీ కార్యాలయం ముందు ఆర్యన్ హాజరుకావడం ఇదే మొదటిసారి.