Friday, April 26, 2024
Friday, April 26, 2024

భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్‌ యూయూ లలిత్‌

సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ (యూయూ లలిత్‌) నేడు ప్రమాణస్వీకారం చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్‌ యూయూ లలిత్‌ చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో పాటు కేంద్రంలోని పెద్దలు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, ప్రస్తుత జడ్జిలు హాజరయ్యారు. సీజేఐ యూయూ లలిత్‌ 1957 నవంబర్‌ 9న మహారాష్ట్రలోని షోలాపూర్‌లో జన్మించారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. 2014 ఆగస్ట్‌ 13న ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. న్యాయవాది నుంచి సుప్రీంకోర్టు జడ్జిగా నేరుగా నియమితులైన అతికొద్దిమందిలో ఆయనొకరు. మరోవైపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ యూయూ లలిత్‌ అతి కొద్ది కాలం మాత్రమే బాధ్యతలను నిర్వహించనున్నారు. కేవలం 74 రోజుల్లోనే ఆయన పదవీ కాలం ముగియనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img