దేశంలో కొత్తగా 3,303 పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. తాజాగా కరోనా కేసుల సంఖ్య మూడు వేలు దాటాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్త కరోనా పాజిటివ్ కేసులు 3,303 నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,68,799కు చేరాయి. ఇందులో మొత్తం 4,25,28,126 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 39 మంది కరోనాతో మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,23,693కి పెరిగింది. దేశవ్యాప్తంగా 2563 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 98.06 శాతంగా ఉంది. ఇక దేశంలో 16,980 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,88,40,75,453 వ్యాక్సిన్లు పంపిణీ చేశామని, గత 24 గంటల్లో 19,53,437 మందికి వ్యాక్సినేషన్ చేశామని తెలపింది.