Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ఎవరినీ ఒత్తిడి చేయలేం: సుప్రీంకోర్టు

కొవిడ్‌ టీకాను వేయించుకోవాలని ఏ ఒక్క వ్యక్తిని కూడా ఒత్తిడి చేయలేమని, ఈ విషయంలో ఎవరినీ ఒత్తిడి చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.ప్రస్తుతం జరుగుతున్న వ్యాక్సినేషన్‌ విధానం అసంబద్ధంగా ఉందని అనలేమని సుప్రీం తెలిపింది. సమాజ హితం కోసం పాలసీ తయారు చేసి, అమలు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపింది. వ్యాక్సిన్‌ వేయించుకోలేదనే కారణంతో వ్యక్తులను పబ్లిక్‌ ప్రదేశాలకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్గనైజేషన్లు అనుమతించడం లేదని… ఇది సరికాదని సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుతం కరోనా కేసులు తక్కువగా ఉన్న నేపథ్యంలో, ఇప్పటికైనా ఇలాంటి నిర్ణయాలను అమలు చేయడాన్ని ఆపేయాలని ఆదేశించింది. కరోనా వ్యాక్సిన్‌ ప్రతి ఒక్కరూ వేయించుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ డాక్టర్‌ జాకోబ్‌ సుప్రీంకోర్టులో పిల్‌ వేశారు. ఈ పిల్‌ ను విచారించిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం… వ్యాక్సిన్‌ కచ్చితంగా వేయించుకోవాలని ఆదేశించలేమని తీర్పును వెలువరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img