Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

స్పైసెస్‌ పార్క్‌తో 1500మందికి ఉద్యోగావకాశాలు.. సీఎం జగన్‌

గ్లోబల్‌ స్పైసెస్‌ యూనిట్‌ ప్రారంభించిన సీఎం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పల్నాడు జిల్లాలో పర్యటించారు. యడ్లపాడు మండలంలోని వంకాయలపాడు సుగంధ ద్రవ్యాల పార్క్‌లో ఐటీసీ సంస్థ ఏర్పాటు చేసిన గ్లోబల్‌ స్పైసెస్‌ ప్రాసెసింగ్‌ ఫెసిలిటీ యూనిట్‌ను సీఎం ప్రారంభించారు. అనంతం ఆ యూనిట్‌లో పర్యటించి.. ప్రాసెసింగ్‌ గురించి అడిగి తెలుసుకున్నారు. ఐటీసీ సంస్థకు అభినందనలు తెలిపారు. ఐటీసీ ఏర్పాటు చేసిన గ్లోబల్‌ స్పైసెస్‌ ప్రాసెసింగ్‌ ఫెసిలిటీ యూనిట్‌ వల్ల వేలాది మంది రైతులకు మేలు జరుగుతుందన్నారు ముఖ్యమంత్రి. సుమారు రూ.200 కోట్లతో ఏటా 20 వేల మెట్రిక్‌ టన్నుల సుగంధ ద్రవ్యాలను ప్రాసెసింగ్‌ చేస్తారని తెలిపారు. 15 రకాల సుగంధ ద్రవ్యాలను ప్రాసెసింగ్‌ చేస్తారని.. రెండవ దశ కూడా పూర్తైతే దేశంలోనే అతిపెద్ద స్పైసెస్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏపీలోనే ఉంటుంది. ఈ యూనిట్‌ 14 వేల మంది రైతులకు ఉపయోగపడుతుందని.. 24 నెలల్లోనే యూనిట్‌ ను పూర్తి చేశారన్నారు. ఏపీ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు ఇదొక నిదర్శనంగా అభివర్ణించారు.
ఏపీ మూడేళ్లుగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. 3450 కోట్లతో ప్రతీ జిల్లాలోనూ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయబోతున్నామని.. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు వల్ల 33 వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. మొదటి దశ కింద రూ.1250 కోట్లతో 10 యూనిట్లకు డిసెంబర్‌ , జనవరి నెలల్లో శంకుస్థాపన చేస్తామన్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు రైతులకు వరమని వ్యాఖ్యానించారు.
రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటను ప్రాసెసింగ్‌ చేసే విధానం చాలా బాగుంది అన్నారు సీఎం జగన్‌. ప్రాసెసింగ్‌ వల్ల రైతుల పంటకు మంచి గిట్టుబాటు దక్కుతుందని.. ఐటీసీ కంపెనీకి ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో సహకారం అందుతుంది అన్నారు. ఏ చిన్న సమస్య ఉన్నా.. ఒక్క ఫోన్‌ చేసినా చాలు వెంటనే స్పందిస్తామని తెలిపారు.ఐటీసీ ఇప్పటికే రూ.140 కోట్లతో వెల్‌కమ్‌ పేరుతో గుంటూరులో ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పల్నాడు జిల్లా యడ్లపాడు వద్ద రూ.200 కోట్లతో అభివృద్ధి చేసిన గ్లోబల్‌ స్పైసెస్‌ పార్క్‌ను తీసుకొచ్చింది. సుమారు 6.2 ఎకరాల్లో మిర్చితో పాటు పసుపు, అల్లం, ధనియాలు, యాలకులు, సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్‌ చేస్తారు. సుమారు 170 గ్రామాల్లో 10,000 మందికి పైగా రైతులతో సుగంధ ద్రవ్యాలను సాగు చేయిస్తోంది. ఆ పంటలను ఈ కంపెనీ నేరుగా కొనుగోలు చేస్తోంది. రైతులు కూడా ఆదాయం పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img