కొచ్చిలో ఎమర్జెన్సీ ల్యాండిరగ్
స్పైస్జెట్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. సౌదీ అరేబియాలోని జడ్డా నుంచి కోజికోడ్ వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానం క్షేమంగా దిగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్పైస్జెట్కు చెందిన బి737-8 మ్యాక్స్ విమానం ఆరుగురు సిబ్బందితో సహా 197 మంది ప్రయాణికులతో జెడ్డా నుంచి కోజికోడ్ వెళ్తున్నది. ఈ క్రమంలో విమానంలో హైడ్రాలిక్ వైఫల్యం తలెత్తడంతో పైలట్..విమానాశ్రయ సిబ్బందికి సమాచారం అందించాడు. దీంతో కొచ్చి ఎయిర్పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండిరగ్ చేశారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయంలో పూర్తి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అయితే విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని అధికారులు తెలిపారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని వెల్లడిరచారు.