Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

హైక‌మాండ్‌కు వ‌దిలేశా.. ఢిల్లీకి వెళ్ల‌డంలేదు

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గ్రాండ్ విక్ట‌రీ కొట్టిన కాంగ్రెస్ పార్టీ.. సీఎం ప‌ద‌వి ఎవ‌రికి ఇవ్వాల‌న్న అంశంపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతోంది. ఆ పార్టీ ఇంకా తుది నిర్ణ‌యం తీసుకోలేదు. సిద్ధ‌రామ‌య్య‌, డీకే శివ‌కుమార్ఇద్ద‌రూ ఆ పోస్టుకు పోటీప‌డుతున్నారు. సీఎంను ఎన్నుకునే విష‌యంలో ఏక వాఖ్య తీర్మానం చేశామ‌ని, ఆ అంశాన్ని పార్టీ హైక‌మాండ్‌కు వ‌దిలేస్తున్నామ‌ని, తాను ఢిల్లీకి వెళ్ల‌డం లేద‌ని, త‌న‌కు ఇచ్చిన క‌ర్త‌వ్యాన్ని తాను నిర్వ‌ర్తించిన‌ట్లు క‌ర్ణాట‌క ప్ర‌దేశ్ కాంగ్రెస్ చీఫ్ డీకే శివ‌కుమార్ తెలిపారు.మ‌రోవైపు ఏఐసీసీ అబ్జ‌ర్వ‌ర్ భ‌న్వ‌ర్ జితేంద్ర సింగ్‌.. క‌ర్ణాట‌క కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌తో బెంగుళూరులో స‌మావేశం నిర్వ‌హించారు. ఆదివారం తెల్ల‌వారుజామున రెండు గంట‌ల వ‌ర‌కు ఆ మీటింగ్ జ‌రిగిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. సీఎంగా ఎవ‌రు ఉండాల‌న్న అంశంపై ప్ర‌తి ఒక్క‌ ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు సేక‌రించిన‌ట్లు భ‌న్వ‌ర్ జితేంద్ర తెలిపారు.సీఎం పోస్టు గురించి తేల్చుకునేందుకు సీనియ‌ర్ కాంగ్రెస్ నేత సిద్ధ‌రామ‌య్య ఇవాళ ఢిల్లీ ప‌య‌న‌మై వెళ్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img