Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

రాను రాను దేశంలో బీజేపీ గ్రాఫ్ పడిపోతోంది

అధికారం కోసం బీజేపీ ఎలాంటి పనికైనా బరితెగిస్తుంది: నారాయణ
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ, పశ్చిమ నియోజకవర్గం సీపీఐ అభ్యర్ధి కోటీశ్వరరావుకు మద్దతుగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారం కోసం బీజేపీ ఎలాంటి పనికైనా బరితెగిస్తుందని ఆరోపించారు. రాను రాను భారత దేశంలో బీజేపీ గ్రాఫ్ పడిపోతోందన్నారు. అన్ని రాష్ట్రాలను తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు.. అవసరమైతే పార్టీల మధ్య చీలికలు తెస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే, ఎంపీలను నోట్ల కట్టలతో కొనుగోలు చేసేందుకు కూడా ప్రస్తుతం బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు తెలియవచ్చిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఏపీలో వైసీపీ , మహా కూటమి ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీకి ఓటు వేసిన ఆ ఓటు బీజీపీకు వెళుతుందని, చంద్రబాబు నాయుడు , వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ బీజేపీ కబందహస్తాల్లో చిక్కుకుపోయారన్నారు. భారతదేశానికి పూర్వ వైభవం తీసుకొచ్చే ఏకైక పార్టీ ఇండియా కూటమి అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img